NTR: దైవ భక్తి లో ఆర్ఆర్ఆర్ హీరోలు… రామ్ చరణ్ బాట లో నే ఎన్టీఆర్..!

NTR: మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలసి తీసిన సంచలనం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంని దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత ప్రతిభ తో ఎంతటి ఘన విజయం అయినప్పటి నుండి చరిత్ర సృష్టిస్తూ మిగతా సినిమాలను తొక్కుకుంటూ పోతోంది.ఇక సినిమాలోని రామ్ చరణ్ ముఖ్యంగా ఎన్టీఆర్ నటనకు సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా… తాజాగా కర్ణాటక సహా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ చిత్రం బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేయడం విశేషం. నైజాం, యూఎస్ లో వంద కోట్ల మార్కు చేరుకొని సరికొత్త చరిత్ర లిఖించింది. ఆర్ ఆర్ ఆర్ ఇంత పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో హీరోలు ఎన్టఆర్, రామ్ చరణ్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. తమకు భారీ విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.అలాగే దైవ భక్తి కూడా చాటుకుంటున్నారు.తాజాగా రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించారు. ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో చరణ్ మాలలోనే హాజరయ్యారు. ముంబైలో కూడా ఆయన చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతో నడవడం మీడియా దృష్టిని ఆకర్షించింది.అయితే రామ్ చరణ్ దీక్ష తీసుకోవడం ఇంతకు ముందు కూడా చూసాం. కానీ ఇపుడు రామ్ చరణ్ బాటలో ఎన్టీఆర్ కూడా ఇస్తాదైవం అయినా ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటున్నాడని సమాచారం.

తాజా రిపోర్ట్స్ ప్రకారం తారక్ ఆంజనేయస్వామి దీక్ష చేపట్టబోతున్నాడని తెలుస్తోంది. 21 రోజులపాటు దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నాడట తారక్‌. మరోవైపు ఎన్టీఆర్, కొరటాల మూవీ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా కొరటాల తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ఎన్టీఆర్ బరువు తగ్గనున్నాడట. అలాగే మూవీ బడ్జెట్ కూడా రూ. 300 కోట్లని సమాచారం. గతంలో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ ఇది పాన్ ఇండియా మూవీ అని ధృవీకరించారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సినిమా చేయబోతున్నారు.