NTR: ఎన్టీఆర్ కొరటాల సినిమా లో ఆలియా చెల్లిగా జాన్వీ కపూర్?

NTR:ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు దాదాపు రెండేళ్లు సినిమాలో కనిపించలేదు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం చాలా రోజులు కేటాయించారు ఎన్టీఆర్, రామ్ చరణ్.ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయింది. ప్రొమోషన్స్ లో బిజీ గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ కెరీర్లో ఇది 30వ మైలురాయిగా తెరకెక్కనుంది. దీంట్లో ఎన్టీఆర్ కి జోడిగా ఆలియా భట్ నటిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

అంచనాలకు తగ్గట్టుగానే కొరటాల శివ ఈ సినిమా కి సంబంధించి నటీనటుల దగ్గరి నుంచి ప్రతి చిన్న విషయంలోనూ చాలా జాగ్రత్త పడుతున్నారట. ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో హీరోయిన్ ఆలియా తో పాటు,మరొక హీరోయిన్ కి అవకాశం ఉందట. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ ఆల్మోస్ట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందట.  కొరటాల శివ ఇంతకుముందు భరత్ అనే నేను సినిమా కి గాను కియారా అద్వానీ ప్లేస్లో జాన్వి కపూర్ ని తీసుకోవాలని అనుకున్నాడట. కానీ అప్పుడది కుదరలేదు. మొత్తానికి కొరటాల శివ తన సినిమాలో జాన్వీ కపూర్ ని ఇప్పుడు తీసుకుంటారు అనమాట.

అయితే నిజానికి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫస్ట్ ఛాయిస్ జాన్వీ కపూర్ అని.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేసినప్పుడు కూడా హీరోయిన్ గా ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కే మొగ్గుచూపాడని వార్తలు కూడా వచ్చాయి.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా ఈ సినిమాను కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు.గతంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కమర్షియల్గా పెద్ద విజయం సాధించడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఫాన్స్ ని ఆడియన్స్ని ఏ విధంగా అలరిస్తుందో చూడాలి…!!