NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.మార్చ్ 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ ను ఎస్ ఎస్ రాజgమౌళి దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్ తో పాటు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు జోడిగా ఓలివియా మోరిస్, ఆలియా భట్ లు నటించారు.ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ చేసిన నటనకుi ప్రశంసలు అందుకున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయిన తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ లలో ఒక్కరిగాఇదిగా ఎదిగారు.
తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న సినిమాకు పారితోషకాన్ని పెంచారు.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో భీమ్ పాత్ర పోషించిన ఎన్టీఆర్ ఆ సినిమా కోసం 45 కోట్ల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం.ప్రస్తుతం ఎన్టీఆర్ చేయబోయే తదుపరి చిత్రాల కోసం 55 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయ్.కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న మాస్టర్ పీస్ 70 రోజుల షెడ్యూల్ కు ఎన్టీఆర్ 55 కోట్లు తీసుకుంటున్నారట.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి, ఆలియా కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఐతే తాజా సమాచారం ప్రకారం ఆలీయా ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట, పెళ్లి కారణంగా తప్పుకున్నట్టు సమాచారం.తెలుగు చలన చిత్ర పరిశ్రమల లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల జాబితా లో కొరటాల శివ కూడా ఒకరు.ఇక ఈ సినిమాని కొరటాల పాన్ ఇండియా చిత్రంగా తీస్తున్నట్టుగా ఆయనే తెలిచేసారు.
