NTR: ప్రశాంత్ తో సినిమా కోసం ఎన్టీఆర్ లైన్ క్లియర్ చేస్తున్నాడా…. ఈ ఏడాది చివరికి సినిమా మొదలు పెడతారా….!

NTR : ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ విజయం తరువాత హనుమాన్ దీక్ష తీసుకున్నారు. ఇక కొరటాలతో తన 30వ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా ను లైన్ పెట్టాడు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడు తారక్. ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడు. అయితే ఇంకా క్లారిటీ రావాల్సివుంది.

అయితే ప్రశాంత్ నీల్ తాజాగా వచ్చిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 2 ఘన విజయం సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్ధలుకొడుతోంది. ఇక ప్రపంచంలోనే త్వరగా 200కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా టాప్ రెండవ ప్లేసులో లో ఉంది. ఇక బాలీవుడ్ లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. కేజీఎఫ్ 2 సినిమా మంచి విజయం సాధించడంతో ఎన్టీఆర్ ఆనందంలో ఉన్నాడట. ఇక ఎపుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమాకు లైన్ క్లియర్ చేసే పనిలో ఉన్నారట. ప్రభాస్ తో సలార్ సినిమా షూటింగ్ ఆల్రెడీ ప్రారంభించి 30%పూర్తయింది.

ఇక మిగతా షూటింగ్ పూర్తి చేసి సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ప్రశాంత్ అనుకుంటున్నాడు. ఇటు తిరిగి ఈ సినిమా ను ఏడాది చివరికి మొదలు పెట్టాలని భావిస్తున్నారు. దీంతో ఇపుడు ఎన్టీఆర్ కొరటాల సినిమా ను త్వరగా పూర్తి చేసి ప్రశాంత్ సినిమాకు సిద్దమవ్వాలని భావిస్తున్నాడు. ఇక దానికోసం బుచ్చిబాబు సినిమా ను వాయిదా వేసుకుంటాడని ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తుంది.చూడాలి మరీ ప్రశాంత్, ఎన్టీఆర్ లా సినిమా ఇపుడు మొదలవుతుందో…