నామినేష‌న్ ప్ర‌క్రియ షురూ..సుత్తుల‌తో కొట్టుకోమ‌న్న బిగ్ బాస్

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ఆదివారంతో స‌క్సెస్ ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇంక మ‌రో 50 రోజుల ప్ర‌యాణం మిగిలి ఉండ‌గా, ఇందులో విన్న‌ర్ ఎవ‌రు ఎలిమినేట‌ర్స్ ఎవ‌రు అనే ఆస‌క్తి జనాల‌లో రోజురోజుకు పెరుగుతూ పోతుంది. 15 మందితో మొద‌లైన బిగ్ బాస్ జ‌ర్నీలో వైల్డ్ కార్డ్ పేరుతో అవినాష్‌, సాయి కుమార్, స్వాతి దీక్షిత్ కూడా భాగం అయ్యారు. ఒక్కో వారం ఒక్కో హౌజ్‌మేట్ బిగ్ బాస్ గ‌డ‌ప దాటుతూ వ‌స్తున్నారు.

సూర్య కిరణ్ (తొలివారం), కరాటే కళ్యాణి (రెండో వారం), దేవి (మూడోవారం), స్వాతి దీక్షిత్ (నాలుగో వారం), సుజాత (ఐదోవారం), గంగవ్వ (ఐదోవారం అనారోగ్యంతో నిష్క్రమించింది), కుమార్ సాయి (ఆరోవారం), దివి(ఏడోవారం) బిగ్ బాస్ హౌజ్‌ని వీడారు. ఇప్పుడు ఎనిమిదో వారం హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చే హౌజ్‌మేట్‌ని నామినేష‌న్ చేసే క్ర‌మంలో బిగ్ బాస్ ఆస‌క్తిక‌ర టాస్క్ ఇచ్చారు.

సోమవారం వ‌చ్చిందంటే ఇటు ప్రేక్ష‌కులు, అటు హౌజ్‌మేట్స్ గుండెల్లో ద‌డ మొద‌ల‌వుతుంటుంది.ఎవ‌రు ఎవరిని నామినేట్ చేస్తారో, ఏ రీజ‌న్‌తో వారిపై నామినేష‌న్ ముద్ర వేస్తారా అని అంద‌రిలో టెన్ష‌న్ పెరుగుతూ ఉంటుంది. ఏడో వారం నామినేషన్ ప్ర‌క్రియ‌లో బిగ్ బాస్ హౌజ్‌మేట్స్ ఫోటోల‌తో కూడిన ప‌ల‌క‌లు ఇచ్చి వాటిని సుత్తితో ప‌గ‌ల‌గొట్ట‌మ‌ని చెప్పారు.

అరియానాలో మార్పు కోసం ఆమెని నామినేట్ చేస్తున్నాన‌ని మెహ‌బూబ్ చెప్ప‌డంతో అరియానా ఫైర్ అయింది. చేంజ్ కావాలంటే నామినేట్ చేస్తారా, ఒక‌వేళ ఎలిమినేట్ అయితే ఏంటి ప‌రిస్థితి అని మండిపడింది. ఇక అమ్మ రాజ‌శేఖ‌ర్ .. అభిజిత్‌తో మోనాల్ మాట్లాడ‌క‌పోవ‌డానికి కార‌ణం అఖిలే అని నిందించిన‌ట్టు ప్రోమో ద్వారా తెలుస్తుంది. అయితే అఖిల్ కూడా ఈ ఇష్యూపై స్పందిస్తూ నేను ఏ రోజు మోనాల్‌ని అభిజిత్‌తో మాట్లాడొద్దని చెప్ప‌లేదు అంటూ గ‌రం అయ్యాడు.

లాస్య‌ని నామినేట్ చేసే క్ర‌మంలో అవినాష్ చెప్పిన రీజ‌న్‌కు ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు క‌నిపిస్తుంది. మ‌రోవైపు అభిజిత్ మ‌ళ్ళీ మోనాల్‌ని నామినేట్ చేసిన‌ట్టు ప్రోమో ద్వారా అర్ధ‌మ‌వుతుంది. మొత్తానికి ఈ రోజు జరిగే నామినేష‌న్ ప్ర‌క్రియా బిగ్ బాస్ హౌజ్ టాప్ లేప‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.