మాల్దీవుల‌లో భ‌ర్త‌తో ర‌చ్చ చేస్తున్న నిహారిక‌.. ఫొటోలు వైర‌ల్

క‌రోనా వ‌ల‌న దాదాపు ఏడు నెల‌ల పాటు ఇంటికే ప‌రిమిత‌మైన సెల‌బ్రిట‌లు ఇప్పుడిప్పుడే బ‌య‌ట అడుగుపెడుతున్నారు. ఫ్యామిలీల‌తో క‌లిసి విహార‌యాత్ర‌ల‌కు వెళుతున్నారు. అయితే అందాల భామ‌లు అంద‌రు మాల్దీవుల‌కి వెళుతుంటే హీరోలు దుబాయ్ చుట్టొస్తున్నారు. కొత్త‌గా పెళ్ళైన కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత‌,దిశా ప‌టానీ ఇలా చాలా మంది అందాల భామ‌లు మాల్దీవుల‌కి వెళ్లి అక్క‌డ ర‌చ్చ ర‌చ్చ చేశారు. అంతేకాదు ఆ లొకేష‌న్స్‌కు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ క‌లిగించారు.

డిసెంబ‌ర్ 9న పెళ్లి పీట‌లెక్కిన నిహారిక త‌న భ‌ర్త‌తో క‌లిసి హ‌నీమూన్ కోసం మాల్దీవుల‌కి వెళ్ళింది. అక్కడ అంద‌మైన లొకేష‌న్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా కొన్ని ఫొటోల‌ని షేర్ చేయ‌గా, అవి సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నిహారిక-చైత‌న్య హ‌నీమూన్ కోసం ఎక్క‌డికి వెళ‌తారు అని అంద‌రు ఎదురు చూస్తున్న క్ర‌మంలో రీసెంట్‌గా తాను మాల్దీవుల‌కి వెళ్ళి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ అమ్మ‌డు పోస్ట్ చేస్తున్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా నిహారిక‌-చైత‌న్య‌ల వెడ్డింగ్ జ‌ర‌గ‌గా, ఈ వేడుక‌కు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వ‌రుణ్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్, అల్లు అర్జున్ ,రామ్ చ‌ర‌ణ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. వీరంద‌రు చేసిన సంద‌డికి సంబంధించిన ఫొటోలు అంత‌ర్జాలంలో ర‌చ్చ‌చేశాయి. దాదాపు వారం రోజుల పాటు నిహారిక పెళ్ళి హంగామా జ‌ర‌గ‌గా,ఈ హంగామాకి సంబంధించిన ఫొటోలు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రించాయి. హ‌నీమూన్ పూర్తైన త‌ర్వాత నిహారిక ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ కానుంది.