రష్మి జై శ్రీరామ్‌ పోస్ట్‌కు నెటిజన్ల విపరీత వ్యాఖ్యలు… ఘాటుగా రిప్లై ఇచ్చిన అమ్మడు

టాలీవుడ్‌ నటి రష్మి గౌతమ్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్‌ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్‌ సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో బిగ్‌ స్క్రీన్‌పై అప్పుడప్పుడు మెరుస్తోంది. మరోవైపు సోషల్‌ విూడియాలో లేటెస్ట్‌ ఫొటో షూట్స్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

ఇదిలావుంటే రష్మి తాజాగా ఓ నెటిజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ఒక పోస్ట్‌ చేసింది. అయితే ఈ పోస్ట్‌పై నెటిజన్‌ రిప్లయ్‌ ఇస్తూ.. కాషాయపు రంగు చీర కట్టి.. అన్నీ చెడ్డ పనులు చేస్తున్నావు.

అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికి మండిపోయినట్టుంది. ఆ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ గట్టిగా కౌంటర్లు వేసింది. నేనేమైనా బిల్లులు కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టానా? లేదా నా తల్లిదండ్రుల్ని రోడ్డున వదిలేశానా? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా?.. ట్యాక్సులు కట్టలేదా?.. నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, అకృత్యాలు చేశానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా? విూ దృష్టిలో అసభ్యకరమైన పనులంటే ఏమిటి? ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు ఎక్కువగా వింటున్నా. పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్‌ చేస్తున్నారు.. నా వరకు దేవుడి అందరి వాడు. సనాతన ధర్మంలోని మంచి విషయం అదే అంటూ రష్మి గౌతమ్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చింది.