ప్రియుడి చేతితో గోరుముద్దలు తింటున్న నయనతార.. ఫొటోస్ వైరల్!

గత దశాబ్దన్నర కాలం నుంచి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతూ హీరోలతో పోటీగా రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకుపోతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె కథ ప్రాధాన్యత చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.నయనతార సినిమా అంటే మినిమం వసూళ్లను రాబట్టేలా సినిమా కలెక్షన్లను సాధిస్తుంది. ఇలా కెరీర్ పరంగా దూసుకుపోతున్న నయనతార తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలోకి వచ్చిన అనంతరం శింబు,ప్రభుదేవా వంటివారితో ప్రేమ ప్రయాణాలు కొనసాగించినా చివరికి వారి నుంచి విడిపోయి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు.ప్రస్తుతం అతనితో కలిసి విదేశీ ప్రయాణాలు చేయడం అదే విధంగా దైవదర్శనానికి వెళుతూ ఈ జంట నిత్యం సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఇకపోతే రహస్యంగా వీరిద్దరు నిశ్చితార్థం జరుపుకున్నారని పెళ్లి కూడా చేసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

కానీ వీరిద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని భావించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా వీరి పెళ్లి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే వీరు పెళ్లి గురించి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ వీరు మాత్రం పెళ్లి గురించి ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన తెలియజేయలేదు. ఇకపోతే తాజాగా నయనతారకు విగ్నేష్ శివన్ ఎంతో ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తూ ఉనటువంటి వీడియోను షేర్ చేశారు. ఇలాంటి వీరిద్దరు ప్రేమగా గోరు ముద్దులు తినిపించుకోవడం చూస్తుంటే వీరిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.