Naveen polishetty : రెండో సారి రానున్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ…?

Naveen Polishetty: ప్రస్తుత కాలంలో కింద నుంచి ఎదిగి తనదైన నటనకు గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’నవీన్ పొలిశెట్టి హీరోగా స్వరూప్ ఆర్ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా , ఈ చిత్రం ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా నవీన్ పోలిశెట్టి కి మొదటి సినిమా కావడం విశేషం.

కంటెంట్ ఉంటే తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన సినిమాలను కూడా భారీ హిట్లను చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అలా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి.ఇకపోతే ఈ చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జే లేటెస్ట్‌గా తెరకెక్కించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. కాగా తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. తాజాగా ఇటీవలే చిత్ర ప్రమోషన్లలో భాగంగా స్వరూప్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్ ఉంటుందని వెల్లడించాడు.

అయితే ప్రస్తుతం స్క్రిప్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నామని, త్వరలోనే ఈ చిత్రం ప్రారంభంకానున్నట్లు వెల్లడించాడు. ఇక ఇటీవల జాతిరత్నాలు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నవీన్ పోలిశెట్టి..ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించి టీజర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సీక్వెల్ లో నటించబోతున్నాడు.