నాని, ఆత్రేయ… విలన్ కోసం వెయిటింగ్

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకులకి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు. టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలలో వచ్చిన కథని మరల ఎంటర్టైన్మెంట్ జోడించి వివేక్ ఆత్రేయ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సినిమా ప్రేక్షకులకి అనుకున్న స్థాయిలో కనెక్ట్ కాలేదు. ఈ సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

రెండు మతాలకి సంబందించిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం పెద్దలని ఒప్పించడానికి అబద్దాలు చెప్పడం లాంటి కాన్సెప్ట్ తో ఎప్పుడో 20 ఏళ్ళ క్రితమే రాజేంద్రప్రసాద్ సినిమా కూడా వచ్చింది. అది కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గానే వచ్చి హిట్ అయ్యింది. మరల అలాంటి కథలు చాలా టాలీవుడ్ లో వచ్చాయి. ఇదిలా ఉంటే వివేక్, నాని కాంబోలో వచ్చిన సుందరానికి ఫ్లాప్ అయినా కూడా మరో ఛాన్స్ ఈ యంగ్ దర్శకుడికి నేచురల్ స్టార్ నాని ఇవ్వడం విశేషం.

డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కామెడీ కథతో కాకుండా పవర్ ఫుల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించడానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి నానికి ప్రతినాయకుడిగా బలమైన క్యారెక్టర్ ఉంది. ఆ పాత్ర కోసం ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలని అనుకుంటున్నారు. అయితే ఎవరిని చేస్తే బాగుంటుంది అనే కోణంలో చూస్తున్నట్లు తెలుస్తుంది.

గతంలో కార్తికేయ గ్యాంగ్ లీడర్ సినిమాలో నానికి విలన్ గా నటించాడు. పవర్ ఫుల్ పాత్రనే చేసినా కూడా సినిమా డిజాస్టర్ కావడంతో ఆ కాంబో వర్క్ అవుట్ కాలేదు. అయితే మళ్ళీ ఈ మూవీ కోసం కార్తికేయ పేరుని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విలన్ గా అతనికి రెండు సినిమాల అనుభవం ఉండటంతో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అలాగే వేరే యంగ్ హీరోల పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.