అఖిల్ – చైతూ మల్టీ స్టారర్.! వద్దంటోన్న నాగార్జున.!

అక్కినేని ఫ్యామిలీ మూవీగా వచ్చిన ‘మనం’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీగా అక్కినేని కుటుంబానికి ‘మనం’ ఓ తీపి గురుతుగా మిగిలిపోయింది.

ఈ సినిమాతోనే అఖిల్ తెరంగేట్రం చేశాడు. అలాగే, పెద్దాయన అక్కినేని నాగేశ్వరరావుగారి చివరి సినిమాగా ‘మనం’ గుర్తుండిపోతుంది.

ఇక, ఇప్పుడు మరో అక్కినేని మల్టీ స్టారర్‌కి రంగం సిద్ధం చేస్తున్నారట. ఓ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట.

నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన ఓ నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించేందుకు చూస్తున్నాడట. అయితే, నాగార్జున నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదనీ తెలుస్తోంది.

కథ విషయంలో అటు అఖిల్, ఇటు నాగచైతన్య ఇద్దరూ కాన్ఫిడెంట్‌గా వున్నారట. అయితే, ప్రస్తుతం ఇద్దరూ ఫ్లాపుల్లో వున్న కారణంగా ఇలాంటి రిస్కులు చేయడం కరెక్ట్ కాదని నాగార్జున ఆపుతున్నాడట.

అయితే, కథలో వున్న బలం కారణంగా ఆ నిర్మాత హుషారుగా వున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి, నాగార్జున మాట విని చైతూ, అఖిల్ తగ్గుతారా.? లేదంటే, రిస్క్ చేయకపోతే, లైఫ్‌లో రస్క్ కూడా దొరకదు.. అన్నట్లుగా ఈ రిస్క్‌కి సై అంటారో చూడాలి మరి.