నాగచైతన్య, సమంత విడాకులపై మరోసారి స్పందించిన నాగార్జున.. ఏమన్నారో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ చైతన్య,సమంత గత ఏడాది విడాకుల తీసుకొని విడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోవడానికి గల కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకు తెలియలేదు. ఏడేళ్ల పాటు ప్రేమించుకొని ఆ తర్వాత పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట పెళ్లయిన నాలుగేళ్లకే ఇలా అనుకోని విధంగా విడిపోవడాన్ని అభిమానులు జీవించుకోలేకపోతున్నారు. విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఎవరికి వారు ఒకరితో ఒకరికి సంబంధం లేదు అన్నట్టుగాఎవరి కెరీర్ పరంగా వారు బిజీ బిజీ అయిపోయారు.

విడాకులు తీసుకొని విడిపోయిన కొత్తలో సమంత కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో మోటివేషన్ కొటేషన్స్ పెడుతూ విహారయాత్రలు తిరుగుతూ ఆ బాధ నుంచి కోలుకోవడానికి బాగానే ప్రయత్నించింది. ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లు చేయడం కూడా మొదలు పెట్టేసింది సమంత. చైతన్య మాత్రం తన పని తాను చేసుకుంటూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఈ జంట విడిపోవడం పట్ల అనేక రకాల వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై సమంత నాగచైతన్య కానీ అట సమంతా ఫ్యామిలీ కానీ ఇటు అక్కినేని ఫ్యామిలీ కానీ ఎవరు స్పందించలేదు.

కొంతమంది సమంత అదే తప్పు అని కామెంట్స్ చేస్తూ ట్రోలింగ్స్ చేయగా మరి కొంతమంది నాగచైతన్యదే తప్పు అంటూ కామెంట్స్ చేసి ట్రోలింగ్స్ చేశారు. ఇది ఇలా ఉంటే సమంత నాగచైతన్య విడాకుల విషయంపై ఇప్పటికే ఒకసారి స్పందించిన నాగార్జున తాజాగా మరొకసారి సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం పై స్పందించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాగార్జున. ఈ క్రమంలోనే చైతన్య పై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం ఏంటి అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. ఆ విషయం పై స్పందించిన నాగార్జున నాగచైతన్య ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాడు అది నాకు చాలా సంతోషాన్నిస్తోంది. పెళ్లి చేసుకొని విడిపోవడం దురదృష్టకరమే.. దానిని ఒక అనుభవంగా తీసుకోవాలి.. అంతేకాని దాని గురించి ఆలోచించకూడదు జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు.. ప్రజలు కూడా ఈ విషయాన్ని మరిచిపోతారని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు నాగార్జున.