Manchu Manoj: నాకిష్టమైన హీరోలు వారిద్దరే…భీమ్లా నాయక్ పై ట్వీట్ చేసిన మంచు మనోజ్!

Manchu Manoj: భీమ్లా నాయక్ విడుదలకు ముందు నుండే రచ్చ మొదలెట్టింది. ఇక రిలీజ్ రోజు ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా భీమ్లా నాయక్ కోసం ఎదురు చూస్తూ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ విష్ చేస్తున్నారు. ఇక ఈ జాబితాలో ఇపుడు మంచు మనోజ్ కూడా చేరిపోయాడు. మంచు మోహన్ బాబు వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్ తనదైన స్టైల్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.
మంచు ఫ్యామిలీలో నా రూటు సపరేటు అన్నట్టుగా మంచు మనోజ్ తీరు ఉంటుంది. మంచు ఫ్యామిలీ గురించి ఎన్నో ట్రోల్ల్స్,మీమ్స్ వచ్చిన మనోజ్ గురించి మాత్రం తక్కువ ట్రోల్ జరుగుతుంది.

ఇక మనోజ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా స్పందించని మనోజ్ భీమ్లా నాయక్ సినిమా కోసం ట్వీట్ చేయడంతో ఇపుడు ఆ న్యూస్ వైరల్ అయింది.
మంచు మనోజ్ పవన్, రానా సినిమా పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. ‘నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు ఓకే ఫ్రేములో ఉన్నారు. ఇప్పటికే అన్ని సానుకూలమైన స్పందనలను విన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఒకే ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకు.. నా డార్లింగ్ రానా దగ్గుబాటికి… త్రివిక్రమ్ గారి టీమ్ మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను‘ అంటూ ట్వీట్ చేశారు.
ఇక ఈ పోస్ట్ తో మనోజ్ ఫేవరెట్ హీరోస్ ఎవరినే విషయం చెప్పేసారు. ఇక భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఇక పవన్ కళ్యాణ్,రానా నటన ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో సముద్రఖని, రావు రమేష్, నిత్యమేనన్, సంయుక్త మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమాకు మాటలు స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు,డైరెక్టర్ సాగర్ కే చంద్ర కొత్త దర్శకుడైనా ఇద్దరు స్టార్ హీరోస్ ని బాగానే హ్యాండిల్ చేసారనే టాక్ వినిపిస్తోంది.