Devi Sri Prasad: చెప్పులతో కొడతారంటూ దేవి శ్రీ ప్రసాద్ కు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్..!

Devi Sri Prasad: దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కు మ్యూజిక్ ను అందించారు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ ఒక ఇమేజ్ ని ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నారు. ఈ అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం వివాదాల పాలవుతున్నారు. గత ఏడాది దేవిశ్రీ దేవుళ్ళ పై చేసిన కామెంట్ వల్ల వివాదంలో చిక్కుకున్నారు. ఇక ఇప్పుడు మరో సారి కూడా ఒక కామెంట్ చేసి మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన ఒక కామెంట్ వల్ల వివాదంలో చిక్కుకున్నారు ఈ అగ్ర మ్యూజిక్ డైరెక్టర్. వివరాల్లోకి వెళితే

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు సినిమా డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్‌ ఈయనకు దేవుడి మీద భక్తి ఎక్కువ అందువల్ల దేవుడి మీద భ‌క్తితో మాల‌లు వేసుకునే అల‌వాటు కూడా ఉందట అయితే దేవిశ్రీ ప్రసాద్ దేవుడిపై భ‌క్తితో వేసుకునే మాల‌ల‌కు, అమ్మాయిల‌కు ముడిపెడుతూ మాట్లాడ‌టం జరిగింది అదే ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సియ‌ల్ అయ్యింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ మీరేమో స్వామి మాల‌, మురుగ‌న్ మాల అని వెళుతుంటారు. మేమేమో సీత‌, గీత అని వెళుతుంటాము అని దేవిశ్రీ ప్ర‌సాద్ కిషోర్ తిరుమ‌ల‌ను ఉద్దేశించి అన్నారు. దాంతో హిందువులు ఎంతో ప‌విత్రంగా, భ‌క్తితో వేసుకునే మాల‌ల విష‌యంలో అలా అగ్ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడ‌టం.ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ను ఇబ్బందులలో పడేసింది.

సూపర్ హిట్ చిత్రాలలో పాటలకు సంగీతాన్ని అందించి తన టాలెంట్ ను చూపించిన దేవిశ్రీ ప్ర‌సాద్. ఆ విధంగా దేవుళ్ళ మీద కామెంట్లు చేస్తూ మాట్లాడ‌టాన్ని ఇప్పుడు హిందూ సంఘాలు త‌ప్పు ప‌డుతున్నాయి. ఇది వ‌ర‌కే ఇలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకు హైద‌రాబాద్ గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ దేవిశ్రీకి వార్నింగ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మ‌రోసారి దేవిశ్రీ ప్ర‌సాద్ మాట‌ల‌ను ఎమ్మెల్యే రాజాసింగ్ త‌ప్పు ప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రాజా సింగ్‌ మాట్లాడుతూ త‌న త‌ప్పును దేవిశ్రీ ప్ర‌సాద్ తెలుసుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలని లేకపోతే తెంగాణ ప్ర‌జ‌లు చెప్పుల‌తో కొడ‌తార‌ని వార్నింగ్ ఇచ్చారు రాజా సింగ్. మ‌రి రాజా సింగ్ ఇచ్చిన వార్నింగ్‌పై దేవిశ్రీ ప్ర‌సాద్ ఏవిధంగా స్పందిస్తారో, లేక అసలు స్పందించరో చూడాల్సిందే.