కొన్నిసార్లు మీడియా ప్రదర్శించే అతి కావొచ్చు.. అత్యుత్సాహం కావొచ్చు కొందరు సెలెబ్రిటీలకు తలనొప్పి తెచ్చిపెడుతుంది. పేర్లు కొంచెం మ్యాచ్ అయితే చాలు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోక ముందే కథనాలు ప్రచురిస్తుంటారు కొందరు. ఈ క్రమంలో మిస్త్రీ చక్రవర్తి (చిన్నదాన నీకోసం) అనే హీరోయిన్ను జాతీయ మీడియా చంపేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా హీరోయిన్ చనిపోయిందని వార్తలు రాసేశారు.

కిడ్నీ ఫెయిల్ అయి మిస్త్రీ చక్రవర్తిచనిపోయిందని వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. చివరకు వికీపీడియాలోనూ చనిపోయినట్టు డేట్ను కూడా ఎంటర్ చేసింది. దీంతో సదరు హీరోయిన్ మీడియాపై సెటైర్లు వేసింది. కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం తాను ఈ రోజు చనిపోయానని, అయితే దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను.. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని చెబుతూ ఫేక్ వార్తలను కొట్టిపారేసింది

.
వాస్తవానికి జరిగిందేంటంటే.. మిస్త్రీ బెనర్జీ అనే ఓ బెంగాలీ నటి కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో చనిపోయింది. మిస్త్రీ అనే పేరు మ్యాచ్ అవడంతో కొన్ని జాతీయ మీడియా సంస్థలు మిస్త్రీ చక్రవర్తిని చంపేశాయి. ఇలా తనను కూనీ చేయడంతో స్వయంగా రంగంలోకి దిగింది మిస్త్రీ చక్రవర్తి. ఇలాంటి కష్టాలు పగవారికి కూడా రాకూడదని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
