విదేశాలకు పయనమైన మెగాస్టార్.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ అగ్ర హీరోలను ఒకరిగా రాణిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి మొదట్లో హిట్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ రాను రాను నెగెటివ్ టాక్ వినిపించింది. దీంతో మెగాస్టార్ అభిమానులకు గాడ్ ఫాదర్ సినిమా విషయంలో కూడా నిరాశ ఎదురయింది.

దీంతో మెగా అభిమానులు ఇప్పుడు అంచనాలు అన్నీ కూడా వాల్తేరు వీరయ్య సినిమాపై పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టైటిల్ సాంగ్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అంటూ అంచనాలు వేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతోంది.

కాగా ఇందులో మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా రామోజీ ఫిలిం సిటీలో పూర్తి అవ్వడంతో సినిమాలోని తదుపరి సన్నివేశాన్ని విదేశాలలో చిత్రీకరించాల్సి ఉంది. దీంతో ఈ సినిమా చిత్రం బృందం మొత్తం ఫ్రాన్స్ కు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కూడా ఫ్రాన్స్ కు.. డిసెంబర్ మొదటి వారం లోపు షూటింగ్ ను మొత్తం పూర్తి చేయాలని అందుకు తగ్గట్టుగా వేగంగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.