సంక్రాంతి రేసులోకి మెగాస్టార్

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్ కి అతి పెద్ద సినిమా పండగ అనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి బైలింగ్వల్ మూవీ వారసుడు కూడా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. అజిత్ తెగింపు కూడా పర్వాలేదనిపించుకుంది.

అలాగ్ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కి కూడా గట్టిపోటీనే ఉందని చెప్పాలి. ఇప్పటికే సంక్రాంతి రేసులో ప్రభాస్ ప్రాజెక్ట్ కె మూవీ ఉంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీంతో పాటు మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. అలాగే శంకర్ ఇండియన్ 2 కూడా అదే టైంలో రాబోతోంది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లేదా ఓజీ సినిమాలలో ఒకటి సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టారు. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే డిసెంబర్ లోనే ఎన్నికలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పవన్ రాజకీయాలపై ఫోకస్ చేశారు. దీంతో ఓజీ, ఉస్తాద్ షూటింగ్ లు నెమ్మదిగా నడిచే ఛాన్స్ ఉంది.

ఈ కారణంగా సంక్రాంతి రేసు నుంచి పవన్ కళ్యాణ్ మేగ్జిమమ్ తప్పుకున్నట్లే. అయితే తమ్ముడు స్థానంలో అన్న మెగాస్టార్ సంక్రాంతికి తన సినిమాతో ప్రేక్షకులని పలకరించే ఛాన్స్ ఉందంట. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బ్రో డాడీ మూవీ రీమేక్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి, సిద్దు జొన్నలగడ్డ తండ్రికొడుకులుగా నటించబోతున్నారు.

ఇక మెగాస్టార్ కి జోడీగా త్రిష, సిద్దుకి జోడీగా శ్రీలల నటిస్తుందని తెలుస్తోంది. మెగా డాటర్ సుస్మిత ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ మూవీని వీలైనంత వేగంగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. భోళా శంకర్ ఆగష్టు 11న రిలీజ్ కానుంది. వెంటనే బ్రోడాడీ షూటింగ్ స్టార్ట్ చేసేసి మూడు, నాలుగు నెలల్లో పూర్తయిపోతే సంక్రాంతికి రెడీ అయిపోతుందని టాక్.