రౌడీ హీరో సినిమాకు మెగాస్టార్ బెస్ట్ విషెస్.. ఆనందంలో సినిమా యూనిట్…!

టాలివుడ్ స్టార్ డైరక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. ఛార్మి, పూరి జగన్నాథ్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 25 వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా .. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో ప్రాంతాలలో పర్యటిస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అంతే కాకుండా సినిమా ప్రమోషన్స్ భాగంగా విజయ్ దేవరకొండ పలు ఇంటర్వ్యూలలో కూడ పాల్గొంటున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు పెంచాయి. ఆగష్టు 24 వ తేదీన కొంతమంది సినీ ప్రముఖులు కోసం ముంబై లో లైగర్ ప్రీమియర్ షో కూడా ప్రదర్శించనున్నారు. ఇలా సినిమా ప్రమోషన్ పనులలో బిజీగా ఉండే లైగర్ చిత్రబృందం ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిశారు. గాడ్ ఫాదర్’సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవిని కలిసిన లైగర్ టీమ్ ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ని కూడా కలిశారు. ఈ క్రమంలో
ఆగస్టు 25న లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి లైగర్ టీమ్ కు బెస్ట్ విషెస్ తెలిపారు.

ఇటీవల మెగాస్టార్ లైగర్ చిత్రయూనిట్ కు విషెస్ తెలుపుతూ.. మీలాగే ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది! నాకౌట్ పంచ్ ఇవ్వండి!! అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. స్వయంగా మెగాస్టార్ ఇలా ట్వీట్ చేయటంతో లైగర్ చిత్ర యూనిట్ ఆనందం లో తేలిపోతున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలయిన ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో తన తదుపరి సినిమా మీద మరింత శ్రద్ధ చూపిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగు పనులలో బిజీగా ఉన్నాడు.