మెగాస్టార్ డ‌బుల్ ధ‌మాకా… అభిమానుల్లో ప‌ట్టలేని ఆనందం‌

సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న హీరోల దగ్గర్నుంచి ఎప్పటిప్పుడు తమ ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ఆఫర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ ఆఫర్స్ ఎక్కువగా యంగ్ హీరోస్ నుండి వస్తుంటాయి. కానీ ఇప్పుడు టాలీవుడ్ కా బాద్ షా, మెగా స్టార్ చిరంజీవి నుండి డబుల్ బొనాంజా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. హీరో చిరంజీవి ప్రస్తుతం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఆచార్య సినిమాలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగ్వర్వాల్ హీరోయిన్ నటిస్తున్నారు.


భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ తమ అభిమానుల్ని అలరించబోతున్నారు. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై చిరంజీవి ఫోకస్ పెట్టనున్నారు. మలయాళం బిగ్గెస్ట్ సినిమా లూసిఫర్ రీమేక్ ను తెలుగులో చేయనున్నారు చిరంజీవి. ఈ సినిమా కూడా త్వరలోనే పూర్తి కావడానికి రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది.

అలాంటప్పుడు మెగాస్టార్ ఖాతా నుండి ఈ ఏడాది రెండు సినిమాలు విడుదలవుతాయంటూ టాలీవుడ్ సినీ వర్గాల టాక్. భారీ బడ్జెట్ సినిమా ఆచార్య వేసవి లో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే లూసిఫర్ సినిమా కూడా రిలీజ్ చేస్తారనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాపై కూడా మెగా స్టార్ చాలా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. లూసిఫర్ సినిమా కి మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే కనుక నిజమైతే మెగాస్టార్ నుండి ఈ ఏడాది రెండు సినిమాలతో మెగా అభిమానులు పండగ చేసుకుంటారు.