SSMB28 విషయంలో ఫ్యాన్స్ కి ఎదురు దెబ్బ తప్పదా?

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చాలా ఇబ్బందులు తర్వాత మళ్ళీ దర్శకుడు త్రివిక్రమ్ తో మళ్ళీ సినిమా అయితే తాను స్టార్ట్ చేసాడు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు మళ్ళీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ పూజా హెగ్డే మరియు శ్రీ లీల లు అయితే నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా షూటింగ్ ని త్రివిక్రమ్ జెట్ స్పీడ్ లో భారీ తారాగణంతో అయితే ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో మహేష్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే మేకర్స్ ఈ ఏడాది లోనే అందులోని ఆగష్టు లోనే రిలీజ్ చేసేస్తామని చెప్పారు.

షూటింగ్ స్పీడ్ కూడా బాగానే ఉంది కానీ కొన్ని ట్రస్టడ్ వర్గాలు చెప్తున్నా దాని ప్రకారం అయితే సినిమా బహుశా వచ్చే ఏడు సంక్రాంతి కానుకగా రావొచ్చేమో.. అంటున్నారు. దీనితో ఈ సినిమా రిలీజ్ అంశం లో మాత్రం ఫ్యాన్స్ కి ఎదురు దెబ్బ తప్పేలా లేదని చెప్పక తప్పదు.

మరి రిలీజ్ ఎప్పుడు అనేది కాలమే డిసైడ్ చేయాల్సిన అంశం. కాగా ఈ సినిమా అయితే సుమారు 200 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండగా ఆల్రెడీ వాటిలో 85 కోట్లు ఓటిటి హక్కులు అలాగే ఓవర్సీస్ లో 4 మిలియన్ మేర డాలర్స్ వచ్చేసాయి. దీనితో ఈ బిజినెస్ లోనే సుమారు బడ్జెట్ లో సగం వెనక్కి వచ్చేసింది.