శర్వానంద్‌ ‘మనమే..’మూవీ టీజర్‌ విడుదల!

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్‌ ప్రామిసింగ్‌ నటులలో శర్వానంద్‌ ఒకడు. ఫీల్‌ గుడ్‌ జానర్‌ సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్‌ సినిమాలతో అలరించే శర్వా.. చివరగా ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఇక శర్వా ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ‘మనమే’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్‌ గా నటిస్తోంది.

ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మూవీ నుంచి చిత్రయూనిట్‌ టీజర్‌ విడుదల చేసింది. ఈ టీజర్‌ గమనిస్తే.. లండన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రానున్నట్లు తెలుస్తుంది. అనుకోకుండా హీరో, హీరోయిన్‌ లైఫ్‌ లోకి ఒక బాబు వస్తే ఏం జరుగుతుంది? ఇంతకీ బాబుకు హీరోకు ఏదైన సంబంధం ఉందా? బాబు ప్లాష్‌ బ్యాక్‌ ఏంటి అనే స్టోరీతో ఈ టీజర్‌ సాగింది.

ఇక టీజర్‌ను చూస్తుంటే డిఫెరెంట్‌ లవ్‌ స్టోరీ ను శ్రీరామ్‌ ఆదిత్య చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పాపులర్‌ బ్యానర్‌ పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్‌ ప్రకటించనున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే, టీజర్‌ లో లండన్‌ బ్రిడ్జ్‌, థేమ్స్‌ నదిని కూడా ఇందులో చూడొచ్చు.క్లీన్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ టీజర్‌ చివరలో హీరోయిన్‌ కృతి శెట్టి పిల్లాడు ఏడుస్తుండు అంటూ హీరో మీద అరుస్తుంటే..ఇద్దరిలో ఒకరే ఏడవండి అంటూ శర్వా చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది!