మమ్ముటి మా వర్క్‌ను ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు : జ్యోతిక

ఏడు పదుల వయస్సు దాటినా ఆ ఛాయలేవీ కనిపించకుండా మెయింటైన్‌ చేసే వ్యక్తుల్లో టాప్‌లో ఉంటాడు మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి. ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న మమ్ముట్టి నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి కాతల్ . మలయాళ లాంగ్వేజ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముంబై భామ జ్యోతిక ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఏవనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నవంబర్‌ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మమ్ముట్టి అండ్‌ జ్యోతిక టీం ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా జ్యోతిక మాట్లాడుతూ.. మమ్ముట్టి హోంబ్యానర్‌లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే ఆయన సినిమా చూశా. ఆయన సినిమాలు చేసే విధానం అద్భుతంగా ఉంటుంది. మమ్ముట్టి ప్రయోగాలు చేసేందుకు ఎప్పడూ రెడీగా ఉంటారు. విభిన్న సినిమాలు చేస్తుంటారు. మమ్ముట్టి సార్‌ తన పనిని చాలా ఎంజాయ్‌ చేస్తారని, ఆయనతో పనిచేయడం గౌరవంగా ఉందని చెప్పుకొచ్చింది జ్యోతిక.

మమ్ముట్టి ఈ ఏడాది పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ఏజెంట్‌ తో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఊహించని డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. మమ్ముట్టి హార్రర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రాహుల్‌ శశీంద్రన్‌ డైరెక్షన్‌లో భ్రమయుగం చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు గేమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న బజూక లో కూడా నటిస్తున్నాడు. డీనో డెన్నిస్‌ కథనందిస్తూ డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. మహి వీ రాఘవ్‌ డైరెక్షన్‌లో యాత్ర సీక్వెల్‌ యాత్ర 2లో కూడా నటిస్తున్నాడు.