RRR:దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కెంచిన RRR కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మార్చి 25వ తేదీన విడుదలైన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలు పోషించారు.ప్రస్తుతం ఈ మూవీ దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనపై అందరూ మాట్లాడుతున్నారు. నార్త్ నుంచి సౌత్ దాకా ఆర్ఆర్ఆర్ హవా నడుస్తోంది.
తాజాగా ఈ సినిమాపై ప్రముఖ నటుడు మకరంద్ దేశ్పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు రాజమౌళి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో అక్కడిని వెళ్లాను. అప్పటికే నాకోసం రామ్చరణ్, రాజమౌళి ఎదురుచూస్తున్నారు. నేను వెళ్లగానే చరణ్ తనను తాను పరిచయం చేసుకున్నాడు. అని చరణ్ గురించి చెప్పుకొచ్చాడు.
ఇక రాజమౌళి గురించి మాట్లాడుతూ.. బాహుబలితోనే దేశ ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్నాడు రాజమౌళి. ఆయన కష్టస్వభావి, ముక్కుసూటి మనిషి. ఎన్నిరోజులనేది నేను చెప్పలేను కానీ నా సినిమాలో మీరుండాలని ఆయన నాతో అన్నాడు. సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చారు కానీ చాలావరకు నా సన్నివేశాలు కట్ చేశారు. నిజానికి రాజమౌళి సర్ ముందు ఒక చిన్న సినిమా తీద్దామనుకున్నాడు. అది కూడా లవ్ స్టోరీ. కానీ రాజమౌళి భార్య నీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అది చేయమని సూచించింది. దీంతో ఆయన ఆర్ఆర్ఆర్ మీద ఫోకస్ చేశాడు. అతడి ఆలోచనలు పెద్దవి, అందుకోసం ఎంతో కష్టపడ్డాడు కూడా! అనుకున్నట్టుగానే ఆ మూవీ రికార్డులు సృష్టిస్తోంది
ఇక ఎన్టీఆర్ గురించి మకరంద్ దేశ్పాండే ఇలా చెప్పారు.. ఎన్టీఆర్ భుజాలపై రామ్చరణ్ ఎక్కి ఫైట్ చేసే సన్నివేశం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతుంది. సెట్స్లోకి నేను వెళ్లగానే ఎన్టీఆర్ లేచి నిలబడి నన్ను కూర్చోమనేవారు. ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడేవాడు. తారక్ ట్రక్లో నుంచి క్రూరమృగాలతో పాటు బ్రిటీష్ సౌధంలోకి దూకే సీన్ అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చాడు మకరంద్ దేశ్పాండే.
