పూజా హెగ్డే.. మైత్రి మాస్టర్ ప్లాన్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిగా ఎదిగింది పూజా హెగ్డే. వరుణ్ దేశ్ ముకుంద సినిమాతో తెలుగు తెరుకు పరిచయమైంది. ఆ తర్వాత ఒక లైలా కోసం లో నాగచైతన్య సరసన నటించింది. ఈ రెండు సినిమాలు క్లిక్ అవ్వలేదు. అయినా ఆమెకు అల్లు అర్జున్ సరసన డీజేలో నటించే అవకాశం వచ్చింది. అందులో గ్లామర్ డోస్ పెండచంతో అందరి దృష్టి ఆమెపై పడింది. కానీ అది కూడా క్లిక్ కాకపోవడంతో ముంబయి కి చెక్కేసింది.

ఇక టాలీవుడ్ లో పూజ కెరీర్ అయిపోయినట్లే అనుకునే సమయంలో ఆమెకు అలవైకుంఠ పురంతో హిట్ పడింది. అంతే, అక్కడి నుంచి పూజ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన ఆమే నటించింది. అయితే, సడెన్ గా పూజ కెరీర్ డీలా పడిపోయింది. చేతికి వచ్చిన ప్రాజెక్టులు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి.

మొన్న గుంటూరు కారంలో మిస్ అయ్యిందా..? ఇటీవల పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా ఆమె ఛాన్స్ కోల్పోయింది. అయితే, ఉస్తాద్ కోసం పూజ ఆల్రెడీ మైత్రే మూమీ మేకర్స్ అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంది. అయితే, ఆమెకు ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవడం కంటే, ఆమెను మరో సినిమాలో తీసుకోవడం బెస్ట్ అని వాళ్లు ఆలోచిస్తున్నారట.

ఈ క్రమంలోనే మైత్రీ మూమీ మేకర్స్ నుంచి ఓ మిడిల్ రేంజ్ హీరో తో ఓ సినిమా రావడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాలో పూజ ను తీసుకుంటున్నట్లు సమాచారం. ఎలాగూ పూజకి ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమాలు లేవు. రెండు భారీ సినిమాలు మిస్ అయ్యాయి. ఇప్పుడు ఈ మూవీ కూడా అంగీకరించకుంటే, మళ్లీ టాలీవుడ్ లో కనిపించడానికి ఎంత కాలం పడుతుందో తెలీదు.

అంతేకాకుండా, తీసుకున్న అడ్వాన్సులు కూడా వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి, ఇవన్నీ ఆలోచించి, పూజ కూడా ఒకే చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ మూవీ వివరాలు ప్రకటిస్తే తప్ప, ఈ మూవీ పై క్లారిటీ రానుంది. మరి ఆ మిడిల్ రేంజ్ హీరో ఎవరో, ఎవరితో పూజ నటించనుందో తెలియాల్సి ఉంది.