మహేష్ స్పీడ్ కావాలంటున్నాడు కానీ..!

ఇపుడు టాలీవుడ్ దగ్గర పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. మరి వీరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఈ సినిమా పై మంచి హైప్ ఉంది.

అలాగే రీసెంట్ గానే వచ్చిన మాస్ వీడియో కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం మొదటి నుంచీ ఏది అంతగా కలసి రాలేదు. షూటింగ్ చాలా అంటే చాలా నెమ్మదిగా కొనసాగుతూ వస్తుంది. దీనితో నత్త నడకన సాగుతున్న ఈ సినిమా మహేష్ బాబు సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేసేయాలని అనుకుంటున్నాడట.

కానీ త్రివిక్రమ్ అండ్ కో నుంచి వస్తున్నా సపోర్ట్ మాత్రం అంతంత మాత్రమే అని ఇప్పుడు సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా మహేష్ అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నాటికి కంప్లీట్ చేసేయాలని అయితే ప్లాన్ చేస్తుండగా త్రివిక్రమ్ తో మాత్రం పని నెమ్మదిగానే ఉన్నట్టు తెలుస్తుంది.

మహేష్ ఈ సినిమాని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసేసి రాజమౌళి సినిమాలో దిగిపోవాలని ప్లాన్ అట. అందుకే స్పీడ్ అయితే పెంచాలని డిసైడ్ అయ్యాడట. మరి ఈ చిత్రం ఎప్పటికి కంప్లీట్ అవుతుందో చూడాలి. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే శ్రీ లీల లు హీరోయిన్స్ గా నటించగా హారిక హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.