పుట్టెడు దుఃఖంలోను అభిమానుల గురించి ఆలోచించి పెద్ద మనసు చాటుకున్న మహేష్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే ఏడాదిలోనే తన తల్లి తండ్రి అన్నయ్యని కోల్పోవడం నిజంగా ఎంతో బాధాకరం. ఇలా మహేష్ బాబు కోలుకోకుండా దెబ్బ పై దెబ్బ పడటంతో అభిమానుల సైతంమహేష్ పరిస్థితి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.ఇక మంగళవారం తెల్లవారుజామున కృష్ణ మరణించడంతో ఒక్కసారిగా అభిమానులు సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కృష్ణ పార్థివదేహాన్ని చూడటం కోసం తరలివచ్చారు.

ఈ విధంగా కృష్ణ భౌతిక కాయని పద్మాలయ స్టూడియోలో ఉంచిన అనంతరం నిన్న మధ్యాహ్నం ఆయన అంతిమయాత్ర మొదలుపెట్టారు. ఇలా నిన్న సాయంత్రం అశ్రునయనాల నడుమ కృష్ణగారి అంత్యక్రియలను పూర్తి చేశారు. ఇక కృష్ణ గారు చివరి చూపు కోసం వచ్చినటువంటి ఎంతో మంది అభిమానుల ఆకలిని దృష్టిలో పెట్టుకున్నటువంటి మహేష్ బాబు వారందరికీ భోజనాలను ఏర్పాటు చేయించారు. అక్కడికి వచ్చినటువంటి అభిమానులు ఏమాత్రం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈయన భోజనాలను ఏర్పాటు చేశారు.

ఈ విధంగా కొంతమంది అభిమానులు ఒకే ఏడాదిలోనే కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి మహేష్ బాబు తన బాధను పక్కనపెట్టి అభిమానుల ఆకలి గురించి ఆలోచించి పెద్ద మనసు చాటుకున్నారని సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా పుట్టెడు దుఃఖంలో కూడా మహేష్ బాబు తన గొప్ప మనసు చాటుకున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ మహేష్ బాబు పట్ల ప్రశంసలు కురిపించారు.