Mahesh Babu: సర్కారీవారి పాట ప్రమోషన్స్ వదిలి పెట్టి దుబాయ్ పయనమైన మహేష్.. కారణం అదేనా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కావడంతో ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించాలని భావించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వదిలేసి సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నఫలంగా దుబాయ్ వెళ్లారు. ఇలా మహేష్ బాబు దుబాయ్ వెళ్లడానికి గల కారణం ఏమిటి అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే మహేష్ బాబు దుబాయ్ వెళ్లడానికి ఒక కారణం ఉంది దుబాయిలో ఆయన మరొక టాప్ సెలబ్రిటీని కలవనున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా అదే మన మహేష్ బాబుతో తదుపరి చిత్రాన్ని చేయాలనుకుంటున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి.సర్కారీ వారి పాట చిత్రం తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా త్వరగా పూర్తి చేసి అనంతరం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఈ సినిమా చర్చల కోసం మహేష్ బాబు దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ రాజమౌళి మాత్రం ఇంకా సినిమా ఏది అనే అంశం ఫిక్స్ కాలేదని తెలిపారు.

మహేష్ బాబు కోసం రాజమౌళి దగ్గర పలు కథలు ఉన్నాయి. ఇంకా వాటిలో ఏది అనే విషయాన్ని ఫైనల్ చేయలేదని వెల్లడించారు. మొత్తానికి వీరి మీటింగ్ చూస్తుంటే మాత్రం త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన సమాచారాన్ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి కథనం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించగా ఈచిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మాత కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కాలం నుంచి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ కోసం ఈయన ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెట్స్ పైకి ఈ ఏడాది ద్వితీయార్థంలో అడుగుపెట్టనుంది.