అప్పుడు తమ్ముడు కోసం.. ఇప్పుడు అన్న కోసం.. మహేష్ వాయిస్ లో అంత పవర్ ఉందా …?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా నిలిచిపోయిన ఆచార్య చిత్రీకరణ త్వరలో తిరిగి ప్రారంభం అయిందట. ప్రస్తుతం కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా త్వరలో ఆచార్య సెట్ లో మెగాస్టార్ కూడా అడుగుపెట్టబోతున్నారు. ఇక రీసెంట్ గా ఆచార్య నుంచి రిలీజైన మోషన్ పోస్టర్ లో సమ్మర్ రిలీజ్ అని అధికారకంగా ప్రకటించారు కూడా. ఈ సినిమా తర్వాత 2021 లో చిరంజీవి కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Chiranjeevi's Acharya Story Stolen? | Gulte - Latest Andhra Pradesh,  Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్ లో కనిపించనుండగా మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ పార్ట్ కూడా కీలకం కావడంతో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తో బిజీగా ఉన్న చరణ్ జనవరి లో ఆచార్య కి డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే సమయంలో మెగాస్టార్ తో చరణ్ పాల్గొనే కాంబినేషన్ సీన్స్ ని తెరకెక్కించనున్నారని సమాచారం.

కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చి మెగా ఫ్యాన్స్ ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసింది. మెగాస్టార్ ఆచార్య సినిమాకి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. గతంలో త్రివిక్రం దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మహేష్ వాయిస్ ..తో పాటు స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కనిపించగానే థియోటర్స్ దద్దరిల్లిపోయాయి.

ఇప్పుడు కూడా అదే రిపీట్ అవబోతుందని అంటున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరకి వరకు మధ్య మధ్య లో మహేష్ బాబు వాయిస్ ఓవర్ కథ ని నడిపిస్తుందన్న టాక్ ఉంది. మొత్తానికి అప్పుడు తమ్ముడు కోసం తన పవర్ ఫుల్ వాయిస్ వినిపించిన సూపర్ స్టార్ ఇప్పుడు అన్నయ్య మెగాస్టార్ కోసం తన వాయిస్ ని ఇవ్వబోతుండటం గొప్ప విషయం. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ అతిథి గా వచ్చిన సంగతి తెలిసిందే.