మహేష్ బాబు న్యూ మూవీలో న్యూ జోడిగా  మహానటి 

సూపర్ స్టార్ మహేశ్ బాబు తర్వాతి ప్రాజెక్ట్ ఏమిటనేది  అఫీషియల్గా ఫైనల్ కాలేదు. ఈలోపే ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఎక్కువగా పరశురాం సినిమానే ఉండవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే మహేష్ చివరి నాలుగు సినిమాలలో కొత్త హీరోయిన్స్ తో జత కట్టాడు. ఈ  సినిమాలో  కీర్తి సురేశ్ కధానాయికగా ఫిక్స్ అని సమాచారం.


ఇప్పటి వరకు మహేశ్  సరసన నటించని హీరోయిన్ అయితే  బావుంటుంది అని భావించిన  దర్శక నిర్మాతలు కీర్తిని చూజ్ చేసుకుని, ఆమెతో సంప్రదింపులు జరిపారని, కీర్తి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.  మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది అధికారిక ప్రకటన వెలువడ్డాకే తెలుస్తుంది.  ఇకపోతే కీర్తి ప్రస్తుతం తెలుగులో ‘మిస్ ఇండియా, రంగ్ దే’ సినిమాల్లో నటిస్తోంది.  ఈ రెండూ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.