టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా ఎన్నోసార్లు తన మంచితనాన్ని నిరూపించుకున్నారు. ఇలా మహేష్ బాబు హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారుల గుండె ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ ఇస్తూ ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టారు.ఇలా మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాలలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా సమకూర్చారు. ఈ విధంగా మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈయన విద్యార్థుల కోసం మరో అడుగు ముందుకు వేసి తన ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే మహేష్ బాబు దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేయించారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్ సమకూర్చారు ఇది ఒక గొప్ప రోజు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇలా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్లు అందించడంతో ఎంతోమంది మహేష్ అభిమానులు అలాగే నేటిజన్స్ పెద్ద ఎత్తున మహేష్ బాబు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక మహేష్ బాబు సినిమాలు విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు అయితే తన తల్లి ఇందిరా దేవి మరణించడంతో సినిమాకు మహేష్ బాబు కాస్త విరామం ప్రకటించారు.
