“గుంటూరు కారం”..ఆ ఫ్లాష్ బ్యాక్ కి భయపడిపోతున్న మహేష్ ఫ్యాన్స్ 

ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ఉన్న స్టార్ హీరోస్ అభిమానులు అంతా కూడా తమ అభిమాన హీరో తీసే ప్రతి సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలనే కోరుకుంటారు. అలానే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “గుంటూరు కారం” తో కూడ మహేష్ బాబు భారీ హిట్ అందుకోవాలి అని సూపర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా డేట్ అన్ని అనౌన్స్ చేశారు కానీ ఫ్యాన్స్ లో మాత్రం ఒక రకమైన కంగారు ఉంది. ఎందుకంటే ఈ సినిమా విషయంలో ఏది సరిగ్గా జరగలేదు. సినిమా స్టార్ట్ అయ్యినప్పుడు నుంచి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి.

అలాగే ఇప్పుడు అనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగడం లేదు ట్రైలర్ ఆలస్యం ఇలా ఇవన్నీ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేస్తున్నాయి. త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన “అజ్ఞ్యాతవాసి” అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కూడా పవన్ తో త్రివిక్రమ్ హ్యాట్రిక్ సినిమా అలానే సంక్రాంతి రేస్ లోనే రిలీజ్ చేశారు.

ఇప్పుడు గుంటూరు కారం కూడా అలానే వస్తుంది. దాని ట్రైలర్ కూడా జనవరి 7న రిలీజ్ అయితే ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ కూడా అదే డేట్ కి మారింది. దీనితో ఇదంతా ఏదో తేడాగా ఉందే అని మహేష్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. దీనితో ఆ సెంటిమెంట్ గాని మళ్ళీ రిపీట్ అవ్వదు కదా అని అనుకుంటున్నారు. మరి ఈ సినిమా విషయంలో ఏమవుతుందో చూడాలి.