Magesh Babu: మరో 30మంది చిన్నారుల్లో వెలుగులు నింపిన మహేశ్ బాబు… ఏం చేశాడో తెలుసా ?

Mahesh Babu: మొన్నటివరకూ తెర వెనకాల ఆయన చేస్తున్న పనులేవో తెలియకపోయినా అభిమానులు ఎంతో కీర్తించారు. ఈ మధ్య కాలంలో ఓ షోలో ఆయన చేస్తున్న ఓ అద్భుతమైన పని గురించి బాలయ్య చెప్పడంతో ఇప్పుడు అంతా ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరో కాదు. ప్రిన్స్ మహేశ్ బాబు. సినిమాల్లో నటిస్తూ మంచి హీరోగా పేరు తెచ్చుకొని, తనకంటూ ఓ స్టార్‌డం ఇమేజ్‌ చేసుకున్న మహేశ్, ఇప్పుడు రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ హీరో అని నిరూపించుకుంటున్నాడు.

ఇక వివరాల్లోకి వెళితే మహేశ్ బాబు తన సొంత ఖర్చులతో పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాడన్న వార్త అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆయన చేస్తున్న మంచి పని గురించి ప్రతీ ఒక్కరూ పొగడకుండా ఉండలేకపోయారు. ఎప్పుడూ సైలెంట్‌గా కనిపిస్తూ, తన పని తాను చేసుకుపోయే ప్రిన్స్ ఇలా నిరుపేద పిల్లల ప్రాణాలు పోస్తున్నాడని తెలిసి చాలా మంది ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. దాదాపు 1000కిపైగా గుండె ఆపరేషన్లు చేయించి, మరో మెట్టుకు ఎదిగాడు మహేశ్.

అయితే తాజాగా అదే తరహాలో మహేశ్ బాబు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అనేకమందిని ఆదుకుంటున్న మన టాలీవుడ్ ప్రిన్స్, మరోసారి 30మంది ప్రాణాల్ని కాపాడారు. ఒక్కరోజే 30 మంది చిన్నారులకు ప్రాణం పోసి, వారి పాలిట దైవం అయ్యారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులందరికీ గుండె ఆపరేషన్లు చేయించారు మహేశ్. ఈ విషయాన్ని ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్రా ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమాల్లోనే కాదు, మహేశ్ ఎక్కడున్నా హీరోనే అంటూ ఆయన అభిమానులు ఆయన్ని కొనియాడుతున్నారు.