బిగ్ బాస్ హౌస్ లో అనాగరిక చర్య జరుగుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నటి మాధవి లత..!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గురించి ఎన్నో విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని,నాగార్జున హౌస్ లో ఎవరిది తప్పు ఎవరిది కాదు అని తెలియకుండా కేవలం నిర్వాహకులు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నడుచుకుంటున్నారని నాగార్జున అలా వ్యవహరించేటప్పుడు ఈ కార్యక్రమం చూడటం ఎందుకు దండగ అంటూ పలువురు నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంపై నటి మాధవి లత స్పందిస్తూ పలు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా మాధవీలత స్పందిస్తూ బిగ్ బాస్ హౌస్ లో అనాగరిక చర్యలు జరుగుతున్నాయని, బిగ్ బాస్ హోస్ట్ కంటెస్టెంట్స్ సూసైడ్ చేసుకునే విధంగా కంటెస్టెంట్ లను అవమానిస్తున్నారని ఈమె ఆరోపించారు. అయితే ఇలాంటి వాటిపై ఎలాంటి మానవ హక్కులు ప్రజా సంఘాలు స్పందించవు అంటూ సోషల్ మీడియా వేదికగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమ నిర్వాహకులను, హోస్ట్ నాగార్జునను ఏకి పారేసింది.

గతంలో గ్రామాలలో ఎన్నో అనాగరిక చర్యలు జరిగేవి. ఎవరైనా తప్పు చేస్తే అర గుండు అర మీసం తీసేసి వారిని గాడిదపై ఊరేగించే వారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇలాంటి ఆచారాలను మర్చిపోతూ ప్రజలలో చైతన్యం కల్పిస్తూ వచ్చాము. కానీ ఇప్పటికి బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని మాధవి లత బిగ్ బాస్ కార్యక్రమం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.కనుక అవకాశం ఉంటే ఇలాంటి రియాలిటీ షోలు నిర్వహిస్తున్న వారికి వంద కోట్ల జరిమానా విధించే దాన్ని అంటూ భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి రియాలిటీ షోల పై మాట్లాడారు.