IPL 2025: రాజస్థాన్ కు లఖ్‌నవూ సడన్ బ్రేక్.. ఆఖరి ఓవర్ లోనే అసలు ట్విస్ట్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఓ ఆసక్తికర పోరులో రాజస్థాన్ రాయల్స్‌కి రెండు పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. కానీ, అద్భుతమైన బౌలింగ్‌తో లఖ్‌నవూ విజయం అందుకుంది. టార్గెట్ 181 పరుగులు కాగా, రాజస్థాన్ చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో 6 పరుగులకే పరిమితమై 178 పరుగులకే నిలిచింది.

రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకట్టుకునే బ్యాటింగ్‌తో ముందుకు తీసుకెళ్లాడు. 51 బంతుల్లో 74 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించాడు. ఇక అతనితో పాటు డెబ్యూ గా వచ్చిన టీనేజ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ (34 పరుగులు) కూడా ఫర్వాలేదనిపించాడు. ఆ తరువాత రియాన్ పరాగ్ 39 పరుగులతో మద్దతిచ్చాడు. చివరి ఓవర్లో హెట్‌మయర్ (12) ఉన్నా, అవేశ్ ఖాన్ బౌలింగ్ బ్రిలియన్స్ తో విజయం లఖ్‌నవూకే దక్కింది. అవేశ్ ఖాన్ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను లఖ్‌నవూ వైపు తిప్పాడు.

శార్దూల్ ఠాకూర్, మార్‌క్రమ్ చెరో వికెట్‌ తీశారు. చివరి ఓవర్‌లో ప్రెషర్ బాగా ఉన్నప్పటికీ, అవేశ్ తన నెరవేర్చిన ఆటతీరుతో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అంతకుముందు లఖ్‌నవూ 20 ఓవర్లలో 180/5 స్కోర్ చేసింది. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ 66 పరుగులతో (45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశాడు. ఆయుష్ బదోని 34 బంతుల్లో 50 పరుగులు చేసి కీలకంగా నిలిచాడు. చివర్లో అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 30 పరుగులు (4 సిక్స్‌లు) బాదడంతో స్కోరు మారింది.

రాజస్థాన్ బౌలింగ్‌లో వానిందు హసరంగ 2 వికెట్లు తీశాడు. ఆర్చర్, తుషార్, సందీప్ ఒక్కో వికెట్ తీసారు. ఓవర్‌ఆల్‌గా మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. అయితే ఆఖరి ఓవర్‌లో జైస్వాల్, హెట్‌మయర్ కలిసి విజయానికి చేరలేకపోయారు. ఒక్క ఓవర్‌లో మ్యాచ్ ఫలితం మారడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

ఎన్టీఆర్ కు ఏమైంది.! || Cine Critic Dasari Vignan EXPOSED Rumors On Jr NTR Health || Telugu Rajyam