అలాంటి ప్రచారంపై లావణ్య ఫైర్

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఏకంగా మెగా ప్రిన్స్ తో లవ్ లో పడి మెగా ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టబోతోంది. ఇన్నేళ్ళ ఆమె జర్నీలో సూపర్ హిట్ సినిమాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. ఎక్కువగా యంగ్ హీరోలతోనే లావణ్య త్రిపాఠి జత కట్టింది.

ఒక్క సోగ్గాడే చిన్ని నాయన మూవీలో మాత్రమే కింగ్ నాగార్జునకి జోడీగా నటించింది. మిగిలిన సినిమాలన్నీ కూడా యంగ్ స్టార్స్ తోనే కావడం విశేషం. వరుణ్ తేజ్ తో ఈ బ్యూటీ మిస్టర్ అనే మూవీ శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసింది. ఈ మూవీ డిజాస్టర్ అయిన ఆన్ స్క్రీన్ పై జోడీగా నటించిన వీరిద్దరూ లవర్స్ గా రియల్ లైఫ్ లో సక్సెస్ అయ్యారు. మిస్టర్ తర్వాత అంతరిక్షం మూవీలో కూడా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కి జోడీగా నటించింది.

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ఎక్కువగా తప్పుడు కథనాలు క్రియేట్ చేసి ప్రచారం చేయడం పరిపాటిగా మారిపోయింది. ఫాల్స్ న్యూస్ కారణంగా వెబ్ ట్రాఫిక్ పెరుగుతుందని కొంతమంది ఇలాంటి గాసిప్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే లావణ్య త్రిపాఠిపైన కూడా ఓ కొత్త రూమర్ ప్రచారంలోకి తీసుకొచ్చారు.

లావణ్య త్రిపాఠి అరుదైన వ్యాధి బారిన పడిందని, కొత్తవాటిని చూసినపుడు ఆమె భయపడుతుందని, గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. ఈ వ్యాధికి ఆమె ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది అంటూ కథనాలు వండి వార్చారు. ఈ తప్పుడు ప్రచారాలపై లావణ్య త్రిపాఠి రియాక్ట్ అయ్యారు.

నాకు వ్యాధి ఉందనే విషయం నాకే తెలియదనే విధంగా ఆమె క్వశ్చన్ మార్క్ పెట్టి అడిగారు. ప్రస్తుతం తాను పూర్తిస్థాయిలో ఆరోగ్యవంతంగా ఉన్నానని, తనని ఎలాంటి వ్యాధులు లేవంటూ లావణ్య క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇలాంటి తప్పుడు వార్తలు మీకు ఎలా ప్రచారం చేయాలనిపిస్తోంది. ఏదైనా వార్త రాసేముందు పూర్తిగా తెలుసుకొని రాయండి అంటూ ఆమె విమర్శలు చేయడం విశేషం.