కృతిసనన్‌ పెద్ద దుమారమే రేపుతోంది!

కృతిసనన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ను ఏలుతున్న కథానాయిక. ఇటీవల ‘ఆదిపురుష్‌’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి సీతగా నటించింది. ‘వన్‌ నేనొక్కడినే’ సినిమాలో మహేష్ బాబు సరసన కథనాయికగా చేసి వెలుగులోకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లో చేతినిండా చిత్రాలతో దూసుకుపోతుంది.

ఇప్పటివరకు పాతికపైనే సినిమాలు చేసిందంటే అమ్మడి స్పీడు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఈ చిత్రాలలో మ్యాగ్జిమం అన్ని బడా హీరోల సినిమాలు కావడం విశేషం. లేడీ ఓరియంటెడ్‌ అయినా.. గ్లామర్‌ సినిమాలైనా ఫస్ట్‌ ఛాయిస్‌ కృతిసనన్‌గా మారింది.

తాజాగా ‘క్రూ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న ఈ సుందరి కాస్త విరామం దొరకడంతో మ్యాగ్జిన్‌లకు ఫొటోషూట్లు చేస్తూ బిజీగా ఉంటోంది. ఈక్రమంలో ఎల్లే అనే మ్యాగ్జిన్‌ కోసం చేసిన ఫొటోషూట్‌ బాగా వైరల్‌ అవుతోంది. కృతిసనన్‌ వంటిపై భాగంలో బ్లూ జీన్స్‌ షర్ట్‌ ధరించి బటన్స్‌ వదిలేసి దిగిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి.