రామ్ సరసన కృతిశెట్టి .. అధికారిక ప్రకటన !

కృతి శెట్టి …. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో పరిచమైన ఈ భామ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రతీ ఏటా టాలీవుడ్‌కు బోలెడంత మంది కొత్త హీరోయిన్‌లు పరిచయం అవుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అందులో కన్నడ భామ కృతి శెట్టి ఒకరు.

Kruti Shetty under Lingusamy direction

తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. దాన్ని సాధ్యం చేసింది కృతి శెట్టి. ‘ఉప్పెన’ రిలీజ్ కాకుండానే నాని సరసన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మకు తాజాగా రామ్ పక్కన నటించే అవకాశం కూడా వచ్చింది. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా కృతి శెట్టిని ఎంపిక చేశారు.

ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కృతి శెట్టికి తమ టీమ్ లోకి వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో ఈ రోజు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఈ భామకు రూ. 60 లక్షల రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినట్టు సమాచారం. తొలి సినిమా ఉప్పెన కోసం రూ. 6 లక్షల పారితోషకం తీసుకున్న ఈ భామ ఇపుడు ఏకంగా రూ. 60 లక్షల రేంజ్‌కు ఎదిగింది. దీంతో పాటు కృతి శెట్టి.. పోసాని సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో కథానాయికగా నటించే చాన్స్ కొట్టేసింది.