Krithi Shetty : బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఉప్పెన ముద్దుగుమ్మ…! ఆ సినిమా రీమేక్ లో నటిస్తోందా?

Krithi Shetty:ఉప్పెన, శ్యామ్ సింగరాయి సినిమాలతో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా చలామణి అవుతోంది కృతి శెట్టి. ప్రస్తుతం కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. శ్యామ్ సింగరాయి సినిమాకి గాను తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా దక్కించుకుంటోంది.

ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో అరడజను సినిమాలు ఉన్నట్లు సమాచారం. డైరెక్టర్ బాల దర్శకత్వంలో సూర్య సరసన తమిళ్ సినిమా లో నటించే అవకాశం కూడా కొట్టేసింది బేబమ్మ.అంతేకాకుండా రామ్‌తో ‘ది వారియర్’ సినిమాల్లో కూడా నటిస్తోంది.ఈ సినిమా తెలుగు తమిళంలో ఏకకాలంలో తెరకెక్కబోతుంది.సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు సాయి ధరమ్ తేజ్ పక్కన పవన్ కళ్యాణ్ లీట్ రోల్లో వినోదయ సీతం అనే తమిళ్ సినిమాకు రీమేక్ వస్తున్న సినిమాల్లో కూడా చాన్స్ కొట్టేసింది.

ఇక తెలుగులోనూ ఫుల్ బిజీ తారగా మారిన కృతి శెట్టికి బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ తగిలింది అని తెలుస్తుంది.అది కూడా స్టార్ హీరో షాహిద్ కపూర్ సరసన అంటున్నారు. గత ఏడాది నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ నాలుగు భాషల్లో విడుదల అయ్యి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారట. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ షాహిద్ కపూర్ చేయబోతున్నాడని సమాచారం. అయితే శ్యామ్ సింగరాయి సినిమాలో ఆధునిక అమ్మాయి పాత్రలో మెప్పించిన కృతి శెట్టి క్యారెక్టర్ని హిందీలో కూడా ఆమెతోనే చేయించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇది కనుక నిజం అయితే కృతి శెట్టి షాహిద్ కపూర్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది అన్నమాట. ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చాక తెలుస్తుంది.