ఇన్సైడ్ టాక్ : మళ్ళీ నాగ్ ఖాతాలో బాలీవుడ్ ప్రాజెక్ట్? బట్ క్లారిటీ ఏంటంటే!

లేటెస్ట్ భారీ స్థాయి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన మోస్ట్ ప్రిస్టేజియస్ బాలీవుడ్ ప్రాజెక్ట్ “బ్రహ్మాస్త్ర”. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రాంఛైజ్ నుంచి వచ్చిన మొదటి సినిమా బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ భారీ స్థాయి ఓపెనింగ్స్ అందుకుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా అనే కాకుండా భారీ మల్టీ స్టారర్ లా కూడా వచ్చింది. హిందీ నుంచి అమితాబ్ షారుఖ్ లాంటి బిగ్ స్టార్స్ ఈ సినిమాలో కనిపించగా తెలుగు నుంచి కింగ్ నాగార్జున కూడా కనిపించారు.

అయితే నాగ్ ఈ చిత్రంలో నంది అస్త్ర అనే పవర్ ఫుల్ పాత్ర చేయడంతో బాలీవుడ్ లో నాగ్ దృష్టి మళ్ళీ పడింది. ఇక ఇదిలా ఉండగా మళ్ళీ నాగార్జున ఇదే సినిమా నిర్మాతలతో మరో ప్రాజెక్ట్ చేస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ ఈ రూమర్స్ పై మాత్రం సినీ  వర్గాల నుంచి మరో టాక్ ఇప్పుడు బయటకి వచ్చింది.

నాగ్ ఎలాంటి మరో సినిమాకి కమిట్ అవ్వలేదట.. తాను ఇప్పుడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబోలో నటించిన చిత్రం ఘోస్ట్ సినిమా రిలీజ్ కోసం అక్కడ నిర్మాతలతో మాట్లాడ్డానికి వెళ్ళాడట. దీనితో ఘోస్ట్ హిందీ రిలీజ్ కోసం మాత్రమే తాను అక్కడికి వెళ్లినట్టుగా ఇప్పుడు ఇన్సైడ్ టాక్. మరి ఈ డీల్ లాక్ అయ్యిందో లేదో అనేది ఇంకా బయటకి రావాల్సి ఉంది.