రవితేజపై “కేజీఎఫ్” హీరో ఫాన్స్ తీవ్ర ఆగ్రహం..!

ప్రస్తుతం విస్తరిస్తున్న టాలీవుడ్ మార్కెట్ లో ఆల్ మోస్ట్ స్టార్ హీరోస్ అంతా కూడా తమ మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్ లో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఆ హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు కాగా రవితేజ ఇప్పుడు నటించిన బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ చిత్రమే “టైగర్ నాగేశ్వరరావు”.

కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ మాసివ్ ఏక్షన్ డ్రామా కొన్ని నిజ జీవిత రూమర్స్ ఆధారంగా తెరకెక్కించగా చిత్ర యూనిట్ అయితే ఓ రేంజ్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. కాగా ఈ భారీ సినిమా ప్రమోషన్స్ లో అయితే రవితేజ పాన్ ఇండియా హీరోస్ విషయంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యష్ విషయంలో చేసిన కామెంట్స్ అన్నిటికన్నా హైలైట్ అయ్యాయి. తాను మాట్లాడుతూ యష్ చాలా లక్కీ అని కేజీఎఫ్ లాంటి సినిమా అతనికి దక్కడం అదృష్టం ఆ సినిమాతోనే తాను ఎవరో నాకు తెలిసింది అని రవితేజ అన్నారు. దీనితో మాటలు యష్ ఫ్యాన్స్ కి అసలు నచ్చలేదు.

టాలీవుడ్ హీరోస్ కోసం ఒకలా మాట్లాడి తమ హీరోని మాత్రం ఇంతలా తగ్గించి మాట్లాడుతారా అంటూ మండిపడుతున్నారు. అయితే కాంట్రవర్సీలకి చాలా దూరం ఉండే రవితేజ ఈ కామెంట్స్ తో అయితే గడిచిన ఈ రెండు మూడు రోజులు నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. కాగా తాను నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అయితే ఈ అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.