Keerthi Suresh: కృతి శెట్టి వద్దన్న ఆ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్!

Keerthi Suresh: టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా మారింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాలో నటించి ఓవర్ నైట్ స్టార్ గా మారింది. తొలిసారి నటనతో మంచి క్రేజ్ సంపాదించుకుంది కృతి. తన అందంతో, నటనతో కుర్రాళ్ళ మనసులను దోచుకుంది.17 ఏళ్లకే హీరోయిన్ గా నిలిచిన కృతి శెట్టి మొత్తానికి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడిపోయింది.

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోలను బాగా పంచుకుంటుంది. నిజానికి ఈ బ్యూటీ బుల్లితెరకు బాలనటిగా పరిచయం అయింది. ఎక్కువగా వాణిజ్యపరమైన ప్రకటనలలో నటించింది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ హీరోయిన్ వరకు చేరుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది కృతి శెట్టి.

డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం లో రామ్ నటిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇవే కాకుండా సుధీర్ బాబు నటిస్తున్న ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ భారీ రెమ్యూనరేషన్ కూడా అందుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ అమ్మడికి మరో సినిమాలో అవకాశం వస్తే ఆ సినిమాకు నో చెప్పేసింది.

డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో శర్వానంద్ మరో సినిమా చేయనున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా కథను సిద్ధం చేశాడు. ఇక ఈ సినిమాలో ముందుగా కృతి శెట్టి ని హీరోయిన్ గా తీసుకోవడానికి సంప్రదించారు. అది కూడా హీరోయిన్ కు తల్లి పాత్రలో నటించాలని డైరెక్టర్ అనడంతో.. తను వెంటనే నో చెప్పినట్లు తెలిసింది. కెరీర్ ప్రారంభంలోనే మదర్ క్యారెక్టర్ చేయడం కరెక్టు కాదు అనుకొని ఆ సినిమాను వదులుకుంది.

దీంతో ఈమె స్థానంలో కీర్తి సురేష్ ను అడగటం తో వెంటనే ఆమె ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కీర్తి సురేష్ ఈ పాత్ర చేయడం ఏంటి అని తన అభిమానులు ఆలోచనలో పడ్డారు. మరి ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎటువంటి గుర్తింపు అందుకుంటుందో చూడాలి.