దర్శకుడికి తలనొప్పిగా మారిన కీర్తీ సురేశ్!

Keerthi Suresh
నితిన్‌, కీర్తీ సురేశ్‌ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రంగ్‌ దే’.  ఈ చిత్రానికి సంబంధించి తాజా షెడ్యూల్‌ దీపావళి తర్వాత దుబయ్‌లో చిత్రీకరణ చేసే అవకాశం ఉంది. అయితే  కీర్తీ సురేశ్ షూటింగ్ రమ్మంటే రానురాను అంటోందిట.
 
Keerthi Suresh
Keerthi Suresh
కారణాలు ఏమైనా.. దుబయ్‌లో చిత్రీకరణ అంటే ఇష్టపడడం లేదట. అందుకు కీర్తీ  దర్శకుడికి తలనొప్పిగా మారిందని చిత్ర యూనిట్ చెప్పుకుంటోంది. అందుకు యూనిట్ మొత్తం తెగ కంగారు పడిపోతోందిట.  కీర్తీ సురేశ్ భారత్ లోనే షూటింగ్ జరపమంటోందిట. ఇలా అయితే ఎలా అని దర్శకుడు బెంబేలెత్తిపోతున్నాడట.  
 
పి.డి.వి ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో  ‘ఏమిటో ఇది’ పాటను  ఇటీవలే విడుదల చేశారు.  దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. శ్రీమణి రచించిన ఈ పాటను కపిల్‌ కపిలన్‌, హరిప్రియ ఆలపించారు. ఈ నెల ఏడో తేదిన పూర్తి పాటను విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది.