కర్ణాటక ప్రభుత్వం నుండి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న ఎన్టీఆర్, రజనీకాంత్?

టాలివుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుండి హీరోగా అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకి తగ్గ వారసుడిగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా లో నటించటం వల్ల ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు బాలీవుడ్ సెలబ్రిటీల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. ఇలా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కర్ణాటక ప్రభుత్వం నుండి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ ఒకటవ తేదీన కర్ణాటకలో నిర్వహించనున్న ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి జూనియర్ ఎన్టీఆర్ కి, హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ కి కర్ణాటక ప్రభుత్వం నుండి ప్రత్యేక ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అయితే కర్నాటక ప్రభుత్వానికి సంబబంధించి అత్యున్నత పౌర పురస్కారంగా భావించే ‘కర్నాటక రత్న’ పురస్కారానికి ఈ ఇద్దరిని ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇలా కర్ణాటక ప్రభుత్వం నుండి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రమే ఆహ్వానం రావడంతో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కర్ణాటక రత్న పురస్కారానికి హాజరై దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. కొంతకాలం క్రితం గుండెపోటుతో మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్ నటుడిగా మాత్రమే కాకుండా.. ఎంతోమందికి సేవ చేసి అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న గొప్ప మనసున్న వ్యక్తి. ఇక పునీత్ రాజ్ కుమార్ కి ఎన్టీఆర్ కి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా… ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాని అధికారికంగా ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.