జూనియర్ ఎన్టీయార్‌కి ‘దేవర’ కొట్టిన దెబ్బ.!

సినిమా వేరు, రాజకీయం వేరు.. అనుకోవడానికి వీల్లేదు. జూనియర్ ఎన్టీయార్ చుట్టూ చాలా రాజకీయం జరుగుతోంది. జూనియర్ ఎన్టీయార్ మౌనాన్ని కూడా రాజకీయ కోణంలో అనుమానించాల్సిన పరిస్థితి.

అయోద్య రాములోరి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి జూనియర్ ఎన్టీయార్ ఎందుకు వెళ్ళలేదు.? ఆహ్వానం అందలేదా.? అందుకుని కూడా వెళ్ళేందుకు మీనమేషాల్లెక్కెట్టడా.? ఈ విషయమై బోల్డన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

తన తాజా చిత్రం ‘దేవర’ షూటింగ్ పనుల్లో బిజీగా వుండడం వల్లే జూనియర్ ఎన్టీయార్ అయోధ్యకు వెళ్ళలేదన్నది ఓ వాదన. అయితే, సైఫ్ అలీఖాన్ గాయపడ్డంతో షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందనే విషయం బయటకు పొక్కింది.

కారణం ఏదైనా, చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీయార్ దూరమయ్యాడు. ఇప్పుడీ విషయమై జూనియర్ ఎన్టీయార్ మీద విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. దీనంతటికీ కారకుడు దర్శకుడు కొరటాల శివ అనుకోవాలా.?

ఇదే విషయమై జూనియర్ ఎన్టీయార్ అభిమానులు, కొరటాల ప్లానింగ్‌పై మండిపడుతుండడం గమనార్హం.