బాయ్ ఫ్రెండ్ తో తిరుమలకి వచ్చిన జాన్వీ?

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి జోడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉన్న సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభం అయ్యింది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్లో జాన్వీ కపూర్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ తారక్ సినిమా కావడం విశేషం. బాలీవుడ్ లో ఈ అమ్మడు ఇప్పటివరకు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలోనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. వాటితో తనను తాను నటిగా ప్రూవ్ చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగే ప్రయత్నంలో ఉంది.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా జాన్వీ కపూర్ తన చిన్ననాటి ఫ్రెండ్, మాజీ ముఖ్యమంత్రి మనవడు శిఖర్ పహారియాతో రెగ్యులర్ గా పార్టీలకు, సెలబ్రిటీ ఈవెంట్స్ కు హాజరవుతూ ఉంది. ఈ నేపథ్యంలో శిఖర్ పహరియాతో ఆమె డేట్ లో ఉందనే మాట బాలీవుడ్ సర్కిల్ లో గట్టిగా వినిపిస్తూ ఉంది. దీనికి బలం చేకూర్చే విధంగా తాజాగా జాన్వీ కపూర్ తిరుమలలో బాయ్ ఫ్రెండ్ తో దర్శనం ఇవ్వడం విశేషం.

జాన్వీ కపూర్ రెగ్యులర్ గా తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటుంది. తిరుమలలో బంధువులు ఉండడంతో వారి ఇంటికొచ్చి దర్శనం చేసుకోవడానికి వెళుతుంది. జాన్వీ కపూర్ తో పాటు చెల్లి ఖుషి కపూర్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అయితే ఈసారి తిరుమలకి జాన్వీ కపూర్ తో పాటు శిఖర్ కూడా రావడం ఆసక్తికరంగా మారింది.

వీరిద్దరికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో ద్వారా జాన్వీ కపూర్ పూర్తిగా శిఖర్ తో రిలేషన్ లో ఉందని ప్రచారానికి ఊతం ఇచ్చినట్లు అయ్యింది అనే మాట వినిపిస్తూ ఉంది. ఇక వీరిద్దరితో పాటు ఖుషి కపూర్ కూడా ఉండడం విశేషం.