అప్పుడు అలియా భట్.. ఇప్పుడేమో జాన్వీ కపూర్.!

అలియా భట్, తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. అదే ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్‌కి జోడీగా నటించింది అలియా భట్ ఈ సినిమాలో. కానీ, రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్‌గా కనిపించలేదామె.! హీరో – హీరోయిన్ల మధ్య కాంబినేషన్ సీన్స్ చాలా తక్కువే.!

ఇప్పుడు అలాంటి పాత్రే, జాన్వీ కపూర్‌కి దక్కనుందట.. అదీ తెలుగులోనే.! పైగా, అది కూడా పాన్ ఇండియా సినిమానే. ఓ ప్రముఖ నిర్మాత, ఇద్దరు ప్రముఖ హీరోలతో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు.

కథ రెడీగానే వుంది. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్‌ని తెరపై చూపించాలని సదరు నిర్మాత నానా రకాల ప్రయత్నాలూ చేశారు. ఇప్పుడు అన్నీ కలిసొస్తున్నాయ్. ఇద్దరూ పాన్ ఇండియా క్రేజ్ వున్న హీరోలే.

వాళ్ళిద్దరి మార్కెట్ రేంజ్ పెరిగింది.. అభిమానుల మధ్య కొట్లాటలు కూడా అనూహ్యంగానే పెరిగాయ్. కానీ, ఆ నిర్మాత మాత్రం, తనక్కావాల్సిన ఆ ఇద్దరు హీరోల్ని ఒకే వేదికపై తీసుకు రావాలనుకుంటున్నారట.

ఆలూ లేదు, చూలూ లేదు.. అప్పుడే హీరోయిన్ ప్రస్తావన ఏంటి.? అంటే, జాన్వీ కపూర్‌కి వున్న క్రేజ్ అలాంటిది మరి.!