రామ్ సినిమాకి ఇద్దరు దర్శకులు ..?

హీరో రామ్ లో ఉన్న అసలు ఎనర్జీ మొత్తాన్ని బయటకు తీసిన సినిమా ఇస్మార్ట్ శంకర్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రామ్ కి భారీ సక్సస్ ని ఇచ్చింది. ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన తడం సినిమా రీమేక్ రెడ్ లో నటించాడు రామ్. ఇప్పటికే రామ్ కి నేను శైలజ వంటి సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటించగా మాళవిక శర్మ, నివేథా పేతురాజ్, అమృత అయ్యర్ హీరోయిన్స్ గా నటించారు. స్పెషల్ సాంగ్ లో హెబ్బా పటేల్ కనిపించనుంది.

Ram Pothineni and Kishore Tirumala's 'RED' has a release date! | Telugu  Movie News - Times of India

కాగా రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ తన సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ లో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ గా ఉండగా 2021 సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ సిద్దమవుతున్నారు. కాగా తాజాగా రామ్ కోసం త్రివిక్రం కథ, స్క్రీన్ ప్లే రాస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగున్న సంగతి తెలిసిందే. కాని ప్రస్తుతానికి కథ, స్క్రీన్ ప్లే మాత్రమే అందిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం త్రివిక్రం కి భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.

అయితే అందరూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటుంది రామ్ సినిమాకి ఇద్దరు దర్శకులు పనిచేయబోతున్నారని. కథ స్క్రీన్ ప్లే త్రివిక్రం అందిస్తే గనక ఖచ్చితంగా మరొకరు దర్శకత్వం వహించాల్సిందే. ఆ రకంగా ఇప్పుడు రామ్ కొత్త ప్రాజెక్ట్ కి ఇద్దరు దర్శకులు అని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో. కాగా మరోసారి రామ్ – పూరి జగన్నాధ్ కలిసి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అలాగే వంశీ పైడిపల్లి తో కూడా రామ్ సినిమా చేసే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.