‘ఉస్తాద్ భగత్సింగ్’లో మొదట హీరోయిన్ పూజా హెగ్దే అన్నారు. కానీ, కుదరలేదు. ఆ తర్వాత ‘గుంటూరు కారం’లోనూ బుట్టబొమ్మే అన్నారు. హీరోయిన్గా ఈ సినిమాలో పూజా హెగ్ధే దాదాపు ఫిక్సయ్యింది కూడా. అయితే, లాస్ట్ మినిట్లో పూజా హెగ్దే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.
అలా ఆ రెండు ఆఫర్లూ శ్రీలీల కొట్టుకెళ్లిపోయింది. ఇక, ముచ్చటగా మూడో ప్రచారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో పూజా హెగ్ధే ఓ సినిమా అని కూడా గుసగుసలు వినిపించాయ్. కానీ, అదీ జరగలేదు. ఏం జరుగుతోంది పూజా హెగ్ధే విషయంలో. స్టార్ హీరోయిన్ పూజా హెగ్ధే. ఇప్పుడంటే బాలీవుడ్లో బిజీ అయిపోయింది కానీ, తెలుగులో పూజా హెగ్ధేనే ఫస్ట్ ప్రిఫరెన్స్గా వుండేది.
అలాంటిది ఇప్పుడు పూజా హెగ్ధేతో సినిమా అంటే, సింపుల్గా నిర్మాతలు నో చెప్పేస్తున్నారట. కొందరు డైరెక్టర్లు ప్రపోజల్స్ తెస్తున్నప్పటికీ నిర్మాతలు మాత్రం ఒప్పుకోవడం లేదట.
ఇంతలా పూజా హెగ్ధేని లైట్ తీసుకోవడానికి కారణాలేంటీ.? ఖచ్చితంగా తెలీదు కానీ, బహుశా డేట్స్ ఇష్యూ అవుతుందనేమో. ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే తెలుగులో పూజా హెగ్ధే కెరీర్ ఖతమైపోయినట్లే.. అంటున్నారు. చూడాలి మరి.! బుట్టబొమ్మ ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తుందో.!