Mahesh Babu:మహేష్ కి జోడీగా మరోసారి ఆ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్న జక్కన్న?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం సర్కారు వారి పాట విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయినా కళావతి పాట సంగీత మధ్యమాలను ఉపేసింది. ఇక మహేష్ సరసన ఈ సినిమా లో కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా ను మే 12 నా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా లో మహేష్ యంగ్ లుక్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. బ్యాంకింగ్ రంగం లో జరిగే మోసాలు గురించి సాగే కథగా సర్కారు వారి పాట సినిమా తెరకెక్కింది. అయితే యాక్షన్ తో పాటు ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించారు డైరెక్టర్ పరశురామ్. షూటింగ్ చివరి దశ లో ఉండటంతో మహేష్ తన తదుపరి ప్రాజెక్టల మీద దృష్టి పెట్టారు.

మహేష్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో చేయనున్నారు. ఈ సినిమా లో పూజహెగ్డే, మహేష్ సరసన హీరోయిన్ గా అనుకుంటున్నారు. కుటుంబ కథాంశం తో ఈ సినిమా ను మాటల మాంత్రికుడు ప్లాన్ చేస్తున్నాడు.మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా అతడు, ఖలేజా తర్వాత 11 ఇల్లు వీళ్లిద్దరికి గ్యాప్ వచ్చింది.

ఇక మహేష్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు, రాజమౌళి సినిమా. దర్శకధీరుడుతో సూపర్ స్టార్ సినిమా ను ఎప్పటినుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరికి ప్రారంభం కానుంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ లో బిజీ గా ఉన్నారు రాజమౌళి అయన తండ్రి విజయేంద్ర ప్రసాద్.

అయితే ఇప్పుడోకా ఆసక్తికర వార్త ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తో తెలుగు తెరకు బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అవుతోంది. ఇపుడు ఈ ముద్దుగుమ్మ ను మరోసారి తన ఫిల్మ్ లో తీసుకోవాలని రాజమౌళి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి సినిమా లో అలియాభట్ భట్ ను హీరోయిన్ గా జక్కన అనుకుంటున్నారట.ఈ సినిమా జంగిల్ అడ్వెంచర్ స్టోరీ అని తెలుస్తోంది. ఎలాంటి సెట్స్ లేకుండా రియల్ లోకేషన్స్ లోనే షూటింగ్ అంతా పూర్తిచేస్తారని అంటున్నారు. మరి మహేష్ కోసం మరోసారి అలియాను నిజంగా దింపుతున్నారో లేదో వేచి చూడాలి.