నిధి అగర్వాల్ చేతిలో ఉన్న ఆ ఒక్క ప్రాజెక్ట్ కూడా పోయిందిగా పాపం..?

టాలీవుడ్ లో ఏ హీరోయిన్ లైఫ్ అయినా సక్సస్ ల మీదే ఆధారపడి ఉంటుంది. అందం, అభినయం ఉన్నా.. ఒక్కోసారి టైం కలిసి రాక చేతిలో ఉన్న అవకాశాలు జారిపోతుంటాయి. ఒక్క హిట్ పడితే వరసగా అవకాశాలు ఎలా వస్తాయో అలాగే ఒక్క ఫ్లాప్ పడినా ఉన్న అవకాశాలు ఒక్కొక్కటి అలా అలా నెమ్మదిగా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. అయితే ప్రస్తుతం నిధి పరిస్థితి కూడా ఇలానే ఉందని చెప్పుకుంటున్నారు.

Nidhhi Agerwal gets invited to raise social awareness for data-backed  accurate information by the Bill and Melinda Gates Foundation | Telugu  Movie News - Times of India

అక్కినేని హీరోలతో వరసగా రెండు సినిమాలు చేసింది. నాగ చైతన్య తో సవ్యసాచి, అఖిల్ తో మిస్టర్ మజ్ఞు సినిమాలు చేసింది.ఈ రెండు సినిమాలు కథ పరంగా బావున్నప్పటికి ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి. దాంతో నిధి కి ఇక టాలీవుడ్ లో అవకాశాలు రావేమో అని అందరూ భావించారు. కాని పూరి నిధి కి ఇస్మార్ట్ శంకర్ తో ఛాన్స్ ఇచ్చాడు. మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న నిధి కి ఇక వరసగా అవకాశాలు వస్తాయని అనుకున్నారు.

కాని ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటించిన నభా కి వచ్చినంతగా నిధి కి అవకాశాలు రాలేదు. అఫీషియల్ గా వచ్చింది ఒక్క మహేష్ మేనల్లుడి అశోక్ గల్లా హీరోగా తెరకెక్కే సినిమానే. ఈ సినిమా కొంత టాకీపార్ట్ కూడా జరిగింది. ఒక సాంగ్ ని చిత్రీకరించారు. కాని ఎందుకనో ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. ఇక రవితేజ తో ఒక సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరిగినప్పటికి అధికారకంగా ప్రకటన రాలేదు. ఇక తమిళంలో ‘భూమి’ అనే సినిమాతో హీరోయిన్ గా కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. కాని ఈ సినిమా కూడా కరోనా కారణంగా ఆగిపోయిందట.